త్వరలో మరో మూడు వందేభారత్‌ రైళ్లు.. ఈ మార్గాల్లోనే

Three more Vande Bharat trains from Hyderabad Soon - Sakshi

దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు   

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య ఈ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. చైర్‌కార్‌ సదుపాయం ఉన్న ఈ రైలు ప్రారంభమైనప్పటి నుంచి.. అనూహ్య రీతిలో ప్రయాణికుల ఆదరణ చూరగొంటోంది. రోజూ వంద శాతం ఆక్యుపెన్సీతో వందే­భారత్‌ పరుగులు తీస్తోంది.

ఈ క్రమంలోనే కాచిగూడ–బెంగళూరు, సికింద్రాబాద్‌–తి­రు­పతి, సికింద్రాబాద్‌–పూనేల మధ్య త్వరలో మరో మూడు వందేభారత్‌ రైళ్లు అందుబాటు­లోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేపట్టింది. రైళ్ల నిర్వహణ కోసం మెకానికల్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ­నిచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. వందేభారత్‌ రైళ్ల కోసం డిపోల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top