సెల్ఫీ మోజులో ముగ్గురు యువతుల మృతి | Three Girls Died In Ali Sagar In Nizamabad | Sakshi
Sakshi News home page

విషాదం: సెల్ఫీ మోజులో ముగ్గురు మృతి

Nov 15 2020 7:01 PM | Updated on Nov 15 2020 7:21 PM

Three Girls Died In Ali Sagar In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అలీసాగర్ రిజర్వాయర్‌లో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. సెల్ఫి దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానాకుల ద్వారా తెలుస్తోంది. మృతులు బోధన్ పట్టణం రాకాసిపేట్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బోధన్‌లోని ఓ వార్డు కౌన్సిలర్ అన్నయ్య కూతుర్లు జుబెరా (16), మశేరా (14), మీరాజ్‌ (12)గా తెలిసింది. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా 16 ఏళ్లలోపు వారే కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. ఈ ఘటనలో రాకాసిపేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

గుంటూరు కొల్లిపర మండలం పిడపర్తి పాలెం లో విషాదం చోటుచేసుకుంది. పశువులు కడగడానికి కాలువలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement