TS SSC Exams Time Table 2022: మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు

Telangana: Tenth Class Public Exams Held Scheduled From May 23 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 23 నుంచి జూన్‌ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.. ఈ ఏడాది మొత్తం 5 లక్షల 8వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. విద్యార్థుల హల్ టిక్కెట్లు గురువారం వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది.

పరీక్షల షెడ్యూల్‌:
మే 23- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్-ఏ
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)
మే 24- సెకండ్ లాంగ్వేజ్..
మే 25- థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)
మే 26- మ్యాథమెటిక్స్‌
మే 27- జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌)
మే 28- సోషల్‌ స్టడీస్‌
మే 30 – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1 (సంస్కృతం, అరబిక్‌)
మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌)
జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ)

చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top