సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్ వెంట ఉన్నారు. ప్రధానితో భేటీ అనంతరం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కలిశారు.
అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి బృందం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందించింది.


