తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్‌ కేసులు

Telangana Omicron Cases Tally Goes Up To 20 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ పంజా విసురుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో శనివారం కొత్తగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 20కు చేరింది. వీరిలో 9 మంది విదేశీయుల ఉండగా.. ఇండియాకు చెందిన ముగ్గురికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. కెన్యా నుంచి వచ్చిన ఆరుగురు, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరికి.. ఘన నుంచి వచ్చిన ఒకరికి, టాంజానియా నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

చదవండి: డెల్టా, ఒమిక్రాన్‌ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్‌ ప్రత్యేకత అదే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top