Telangana: కొత్తగా 16 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 3,209 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 16 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి నలుగురు కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది.