
సాక్షి, హైదరాబాద్: పక్షపాతానికి చిహ్నం లాంటి వ్యక్తి ‘సమతా మూర్తి‘విగ్రహాన్ని ఆవిష్కరించాడు.. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి‘.. అంటూ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ ట్వీట్పై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ ‘నిధుల కేటాయింపు విషయానికి వస్తే తెలంగాణ ప్రజలకు బీజేపీ అన్యాయం చేస్తుంది. కానీ తెలంగాణకు వచ్చినపుడు మాత్రం రాష్ట్ర అభివృద్ధి ఘనత అంతా తమదేనని చెప్పుకుంటారు‘అని ఎద్దేవా చేశారు.