
శుక్రవారం టోక్యోలో ఎన్టీటీ డేటా సంస్థ ప్రతినిధులతో కలసి ఒప్పందపత్రాలను చూపుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు
హైదరాబాద్లో రూ. 10,500 కోట్లతో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
సంయుక్తంగా ఏర్పాటుకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థ ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్
టోక్యోలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ప్రభుత్వంతో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం
రుద్రారంలో తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమ విస్తరణ బాట
రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం.. ప్రభుత్వంతో ఎంఓయూ
సాక్షి, హైదరాబాద్: జపాన్ పర్యటనలో తెలంగాణ బృందం శుక్రవారం రూ. 11,062 కోట్ల భారీ పెట్టుబడులు సాధించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎన్టీటీ డేటాతోపాటు ఏఐ–ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫాం సంస్థ నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో రూ. 10,500 కోట్లతో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
శుక్రవారం టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆయా సంస్థల ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎనీ్టటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్పాయ్, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ శరద్ సంఘీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టోక్యో హెడ్ క్వార్టర్స్గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎన్టీటీ డేటా.. 50కిపైగా దేశాల్లో 1,93,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోని టాప్–3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది.
దేశంలోనే అతిపెద్ద ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయం
హైదరాబాద్లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్వరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందించనుందని.. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు దోహదపడుతుందని వివరించాయి.
మూడో పరిశ్రమకు తోషిబా అనుబంధ సంస్థ ఓకే..
హైదరాబాద్ శివార్లలోని రుద్రారంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమను విస్తరించేందుకు తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ముందుకొచి్చంది. రూ. 562 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. రుద్రారంలో సర్జ్ అరెస్టర్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా సీఎం రేవంత్రెడ్డికి వివరించారు.
ఇప్పటికే రెండు పరిశ్రమలకు తోడుగా అదనంగా ఇది మూడో పరిశ్రమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా పాల్గొన్నారు.
తెలంగాణ పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులు: సీఎం రేవంత్
తెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి.. జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం
తెలంగాణ కొత్త రాష్ట్రమైనా వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జపాన్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన టోక్యోలో జరిగిన ‘ఇండియా–జపాన్ ఎకనామిక్ పార్టనర్íÙప్ రోడ్ షో’లో 150 మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ‘టోక్యో గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణగల వారు. హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన నిపుణులు, స్థిరమైన విధానాలను తమ ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, ఎల్రక్టానిక్స్, విద్యుత్ వాహనాలు, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సానుకూలతలను వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పారిశ్రామికవేత్తలకు వివరించారు.
సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది.
రాష్ట్ర పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులు
తెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు.