కిషన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: జి. చెన్నయ్య 

Telangana: Chennaiah Comments On Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ దళితుల మధ్య అంతరాలను పెంచుతున్న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్‌ చేశారు. ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ కిషన్‌రెడ్డి దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడాన్ని చెన్నయ్య నిరసించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top