ఎంసెట్‌ పరిధిలోకి నర్సింగ్‌ కోర్సులు

Telangana: BSc Nursing Course Admission Via EAMCET Ranks - Sakshi

సాక్షి హైదరాబాద్‌: బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు సీట్లను ఈ ఏడాది ఎంసెట్‌ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. ఈ విషయాన్ని ఎంసెట్‌ నోటిఫికేషన్‌లో పొందుపరచనుండగా, నర్సింగ్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీచేయాలని 2021లో నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాలిచ్చింది. దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.

అయితే ఆ ఆదేశాలు వచ్చేసరికే ప్రవేశాలు పూర్తికావడంతో ఆ ఒక్క ఏడాది మినహాయింపునిచ్చింది. 2022లో ఎంసెట్‌లో చేర్చినా.. సీట్లు నిండకపోవడంతో ఎంసెట్‌ ర్యాంకులతో నిమిత్తం లేకుండానే మెరిట్‌ ఆధారంగానే సీట్లను భర్తీచేశారు. తాజాగా ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సిన తరుణంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఇటీవలే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రికి లేఖ రాశారు. ఎంసెట్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సును సైతం చేర్చాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 85 ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680, ప్రైవేట్‌ కాలేజీల్లో సుమారు 5వేల సీట్లున్నాయి. ఈ సీట్లను ఎంసెట్‌ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. ­ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top