ఆత్మహత్యల కారకులపై చర్య తీసుకోవాలి
బీజేపీ నేత డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, పోలీసు అధికారులపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో తల్లీకొడుకుల ఆత్మహత్యలకు కారణమైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, రామాయంపేట్ మాజీ సీఐతో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని ఒక ప్రకటనలో హెచ్చరించారు.