హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులపై సీఎం రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సోయిలేకుండా మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
‘‘పొలిమేర దాటనివ్వననడానికి అతను ఎవరు..? కలసికట్టుగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాం. అలాగే, టీబీజేపీ నేతలమంతా ఐక్యంగానే ఉన్నాం. అందుకు ఎలాంటి అనుమానాలకు తావులేదు’’ అని డీకే అరుణ తెలిపారు.


