కోట్ల అక్రమాస్తులు బయటపడ్డ భీమ్రెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. నిన్న గురువారం తెల్లవారుజామున పటాన్చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్రెడ్డి ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. రూ.200 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున బినామీల పేరుమీద ఈ ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ తెలిపారు. నిన్న రాత్రి నోటీసులు జారీ చేసిన ఏసీబీ.. బీనామీలను విచారించాకే భీమ్రెడ్డిపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు.


