సీనియర్‌ నేత డీ.శ్రీనివాస్‌కు అస్వస్థత.. ఎంపీ అరవింద్‌ ఏమన్నారంటే?

Senior Leader D Srinivas Admitted In Hospital Due To Illness - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ చీఫ్‌ డీ. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు.. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే, సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్‌ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల అనంతరం డీఎస్‌ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. తన తండ్రి శ్రీనివాస్‌కు అనారోగ్యం నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు మెసేజ్‌లో తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top