Road Accident In Siddipet District - Sakshi
Sakshi News home page

సిద్ధిపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Jan 10 2023 5:06 PM | Updated on Jan 10 2023 6:35 PM

Road Accident In Siddipet District - Sakshi

సాక్షి, సిద్ధిపేట: జగదేవ్‌పూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునిగడపలో అదుపుతప్పిన కారు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

బోనగిరి యాదాద్రి జిల్లా బీబీనగర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు దైవదర్శనం నిమిత్తం వేములవాడకు వెళ్లి తిరుగు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మునిగడప గ్రామం వద్ద కెనాల్ కాలువలో కారు పడింది. మృతులను సత్తమ్మ, స్రవంతి, లోకేష్, భవ్య శ్రీ, రాజమణిగా గుర్తించారు. వెంకటేష్‌ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement