
మేక కోసం బోను దాకా వచ్చి వెనక్కి పోతూ.. ఐదు రోజులపాటు జనాల్ని, అధికారుల్ని..
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. బోను దాకా వచ్చి.. ఎరకు చిక్కకుండా ఐదు అటవీశాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.