సాక్షి, చిత్తూరు: చిత్తూరులో చిరుత పులి మృతి కలకలం రేపుతుంది. ముళ్లపొదల్లో ఇరుక్కొని చిరుతపులి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి దాని కాలికి గాయం ఉన్నట్లు గుర్తించారు. అయితే ముళ్లపొదల్లేనే ఇరుక్కొని చిరుత మృతిచెందిందా.. లేక మరేమైనా కారణాలున్నాయా అనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.


