విజయవాడ: మెగా డీఎస్సీ అక్రమాలపై ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పిల్ దాఖలు చేశారు. డీఎస్సీ-2025 నియామకాలపై సీబీఐ దర్యాప్తు కోరారు. మెగా డీఎస్సీ మొత్తం నియామక ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పిటిషన్ వేశారు.
పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, మెరిట్ జాబితాలపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎస్సీకి సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లను భద్రపరచాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అక్రమ నియామకాలు రద్దు చేయాలని కోరారు. లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్టికల్స్ 14, 16 ఉల్లంఘన జరిగిందని ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


