నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఇంటర్వెల్ సమయంలో బాలికలు ఇలా క్యూ కడుతున్నారు. బాలురు కాంపౌండ్ వాల్ దాటి ఆరుబయటకు వెళ్తున్నారు. ‘మన ఊరు – మన బడి’కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ బిల్లులు రాకపోవడం కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేశాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


