బీజేపీ ఎంపీ ఈటలకు హైకోర్టులో చుక్కెదురు | No Relief for BJP MP Eatala Rajendar in Telangana High Court | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ ఈటలకు హైకోర్టులో చుక్కెదురు

May 1 2025 7:30 PM | Updated on May 1 2025 7:30 PM

No Relief for BJP MP  Eatala Rajendar in Telangana High Court

హైదరాబాద్‌, సాక్షి: బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన చేసిన అభ్యర్థన పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం కొట్టేసింది. 

ఘట్‌కేసర్‌లోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటల రాజేందర్‌ చేయి చేసుకున్నారని అభియోగం ఉంది. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఈటలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

అయితే కేసులో ప్రాథమిక ఆధారాలున్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ దశలో కేసును కొట్టేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. ఈటలపై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటలకు సూచిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement