సాక్షి, తెలంగాణ: వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు వడగాలుల ప్రభాతం సైతం తీవ్రరూపం దాల్చనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయిటకి రాకూడదని తెలిపింది. ఒకవేళ బయిటకి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


