
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం పలు పీసీసీ కమిటీలను నియమించింది. మొత్తం 70 మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. అత్యధికంగా 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 15 మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణ చర్యల కమిటీని నియమించారు.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల బాధ్యులకు అవకాశం కల్పించారు. క్రమశిక్షణ చర్యల కమిటీని నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి చైర్మన్గా, ఎ. శ్యామ్ మోహన్ వైస్ చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వేణుగోపాల్ పేర్కొన్నారు. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమింకుండానే పార్టీ అధిష్టానం వారికి బాధ్యతలు మాత్రం అప్పగించడం గమనార్హం.
రాజకీయ వ్యవహారాల కమిటీ...
మీనాక్షీ నటరాజన్
బి. మహేశ్కుమార్గౌడ్
ఎ. రేవంత్రెడ్డి
భట్టి విక్రమార్క మల్లు
ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి
దామోదర్ రాజనర్సింహ
చల్లా వంశీచంద్రెడ్డి
జి. రేణుకాచౌదరి
పోరిక బలరాంనాయక్
డి. శ్రీధర్బాబు
పొన్నం ప్రభాకర్
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
డి.అనసూయ (సీతక్క)
మొహమ్మద్ అలీ షబ్బీర్
మహ్మద్ అజహరుద్దీన్
ఆది శ్రీనివాస్
వి. శ్రీహరి ముదిరాజ్
బీర్ల ఇల్లయ్య
పి. సుదర్శన్రెడ్డి
కె. ప్రేంసాగర్రావు
జెట్టి కుసుమ్కుమార్
ఈరవత్రి అనిల్కుమార్
ఎక్స్ అఫీషియో సభ్యులు వీరే..
తెలంగాణకు అనుబంధంగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు
తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు
ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల ప్రధాన బాధ్యులు
ప్రత్యేక ఆహ్వానితులు...
రాష్ట్ర కేబినెట్ మంత్రులు
సలహా కమిటీ...
మీనాక్షీ నటరాజన్
ఎ. రేవంత్రెడ్డి
బి. మహేశ్కుమార్గౌడ్
వి.హనుమంతరావు
కె. జానారెడ్డి
కె. కేశవరావు
మధుయాష్కీగౌడ్
జి. చిన్నారెడ్డి
జె. గీతారెడ్డి
ఎం. అంజన్కుమార్ యాదవ్
టి. జయప్రకాశ్రెడ్డి
జాఫర్ జావేద్
టి. జీవన్రెడ్డి
సిరిసిల్ల రాజయ్య
ఎస్. రాములు నాయక్
డీలిమిటేషన్ కమిటీ...
చల్లా వంశీచంద్రెడ్డి
గద్వాల విజయలక్ష్మి
ఆది శ్రీనివాస్
కవ్వంపల్లి సత్యనారాయణ
డా. శ్రావణ్ కుమార్రెడ్డి
పవన్ మల్లాది
డి. వెంకట్రమణ
సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ...
పి వినయ్కుమార్
అద్దంకి దయాకర్
కె. శంకరయ్య
ఎన్. బాలు నాయక్
అరకాల నర్సారెడ్డి
ఆత్రం సుగుణ
రాచమల్ల సిద్ధేశ్వరుడు
సంతోష్ కోల్కొండ
పులి అనిల్కుమార్
జూలూరి ధనలక్ష్మి
మజీద్ఖాన్
డా. జి. రాములు
అర్జున్రావు
సౌరి
కొల్లం వల్లభరెడ్డి
వేణ్మం శ్రీకాంత్రెడ్డి
క్రమశిక్షణా చర్య కమిటీ...
మల్లు రవి, ఎంపీ (చైర్మన్)
ఎ. శ్యామ్మోహన్ (వైస్ చైర్మన్)
ఎం. నిరంజన్రెడ్డి
బి. కమలాకర్రావు
జాఫర్ జాయెద్
జి.వి. రామకృష్ణ