
మహిళగా నన్ను అవమానించారు
ఫోన్ట్యాపింగ్,స్త్రీ నిధి పీఆర్ అవినీతిలో జైలుకు ఖాయం
దయాకర్రావుపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఫైర్
హన్మకొండ చౌరస్తా: వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. హనుమకొండ అశోకా కన్వెన్షన్ హాల్లో గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా నాటి యతిరాజారావు నుంచి మొన్నటి దయాకర్రావు వరకు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా ఉంటున్నాం.. అంతకుముందు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జంగా రాఘవరెడ్డి తమను కోరాగా.. పార్టీలతో సంబంధం లేకుండా దయాకర్రావుకు సపోర్ట్ చేశామన్నారు.
అవమానాలు భరించలేకే రాజకీయాల్లోకి..
దయాకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబుల్బెడ్రూం ఇళ్ల కోసం సొంత ఖర్చుతో స్థలం కొనుగోలు చేసి ఇచ్చాం. స్థలం ఇచ్చే ముందు నా భర్త పేరుపెడతామని చెప్పి చేయలేదు. అప్పటి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శానిటేషన్ ప్యాడ్స్ పంపిణీ నిలిపివేస్తే, మా సంస్థ ఆధ్వర్యాన ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఆ కార్యక్రమానికి దయాకర్రావు రాలేదు. కలెక్టర్, స్కూల్ ఉపాధ్యాయులను సైతం రానివ్వకుండా చేశాడు.
మేము చేసే అనేక కార్యక్రమాలను అడ్డుకుంటూ నన్ను అవమానించాడు. అమెరికా వెళ్లాక ఏనాడు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. దయాకర్రావు చేసిన అవమానాలను తట్టుకోలేకే రావాల్సి వచ్చింది. మంత్రిగా దయాకర్రావు నా ఫోన్ను సైతం ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్, సీ్త్రనిధి నిధుల గోల్మాల్, పంచాయతీ రాజ్ నిధుల్లో అక్రమాలు ఇలా అనేక విషయాల్లో ఆయన జైలుకు పోవడం ఖాయమన్నారు.