Metro Timings For SRH Vs MI Match: ఉప్పల్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

IPL Match: Time Extension Of Metro Trains In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ మ్యాచ్‌ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా నేడు ముంబై ఇండియ‌న్స్-స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం రాత్రి 7:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఉప్ప‌ల్ మార్గంలో మెట్రో రైలు స‌మ‌యం పొడిగించారు.

ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత స‌మ‌యానికి మించి న‌డుస్తాయ‌న్నారు. నాగోల్, ఉప్ప‌ల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేష‌న్ల‌లో చివ‌రి రైళ్లు రాత్రి 12:15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి 1:10 గంట‌ల‌కు గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్ల‌డించారు.

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top