హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి | Hyderabad Ganesh Immersion: Two Boys Died After Truck Rams Bike | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Sep 29 2023 10:12 AM | Updated on Sep 29 2023 4:40 PM

Hyderabad Ganesh Immersion: Two Boys Died - Sakshi

ట్యాంక్‌ బండ్‌ వద్ద లారీ టైర్‌ ఎక్కడంతో ఓ మైనర్‌ బాలుడు దుర్మరణం.. 

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్‌ వద్ద బాలుడు మృతిచెందాడు. గణనాథుడిని తీసుకొస్తున్న లారీ టైర్‌ కిందపడి బాలుడు మృతిచెందాడు. మృతిచెందిన మైనర్‌ కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణిత్‌కుమార్‌గా గుర్తించారు.

మరో ప్రమాదంలో..
బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ సమీపంలో లారీ టైర్‌ కింద పడి ఒకరు మృతిచెందారు. సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం..  నిమజ్జనం చేయడానికి బైక్‌పై వస్తుండగా, బైక్‌ స్కిడ్‌ కావడంతో కుటుంబసభ్యులు కిందపడ్డారు. నాలుగేళ్ల ఆయుష్‌పై నుంచి టక్కర్‌ వాహనం వెళ్లడంతో నిలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement