Mogilaiah Padma Shri: Telangana Cm Kcr Sanctioned 1 Crore Money To Mogilayya - Sakshi
Sakshi News home page

Kinnera Mogulaiah-CM KCR: మొగులయ్యకు రూ. కోటి.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌

Jan 28 2022 9:17 PM | Updated on Jan 29 2022 1:41 PM

Hyderabad: Cm Kcr Sanctioned House 1 Crore Money To Mogilayya - Sakshi

మొగులయ్యను సత్కరిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి బహుమతిగా ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో నివాసస్థలం, ఇంటి నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. దర్శనం మొగుల య్య శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మొగులయ్య కుశాలువా కప్పి సత్కరించారు.

గొప్ప కళారూపాన్ని మొగులయ్య కాపాడుతున్నారని ప్రశంసించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. మొగులయ్యకు గౌరవ వేతనాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నివాస స్థలం, ఇంటి నిర్మాణం విషయంగా మొగులయ్య తో సమన్వయం చేసుకుని, కావాల్సిన ఏర్పాట్లు చూసు కోవాల ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. తెలంగాణ కళలను పునరుజ్జీవం చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ ఆదుకునే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement