
ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
సాక్షి’ కథనానికి స్పందించిన హెచ్చార్సీ
సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కుల సంఘం
తదుపరి విచారణ జూన్ 4కు వాయిదా
సిటీ కోర్టులు: వరుసగా జరుగుతున్న విద్యుత్ షాక్ మరణాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ టీజీఎస్పీడీసీఎల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుపాశాలు’ కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యుత్శాఖ కారణంగా సంభవించిన మరణాలపై సమాగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను జూన్ 4లోపు సమర్పించాలని టీజీఎస్పీడీసీఎల్ను ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.
శంషాబాద్ కొందుర్గు మండలాలలో ఇటీవల జరిగిన ఘటనలతో పాటు గత ఏడాది కాలంలో 69 మంది విద్యుదాఘాతానికి గురై మరణించడం ఆందోళన కలిగించిందని పేర్కొంది. దీనికి కారణం ప్రమాదకరమైన వైర్లు, ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని కమిషన్ పేర్కొంది. జూన్ 2025 మొదటి వారంలోగా ఈ మరణాలకు సంబంధించి వివరణాత్మక నివేదికలను సమర్పించాలని సీఎండీ టీజీఎస్పీడీసీఎల్ను, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది.
గత ఏడాది విద్యుత్ షాక్తో వర్షాకాలంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మరణించిన బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందకపోవడం సంబంధిత అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం.... ప్రజలకు జీవించే హక్కుతో పాటు తమ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోందని కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు సంబంధింత మరణాల్లో ఎక్కువగా కారి్మకులు ఉండడం, వారి మృతదేహాలను సబ్స్టేషన్ల ముందు పెట్టి ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడమేంటని ప్రశ్నించింది. తదుపరి విచారణలోపు నివేదిక సమరి్పంచకపోతే నేరుగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని సంబంధిత అధికారులను హెచ్చరించింది.