
రాజ్భవన్ పాఠశాల విద్యార్థులతో గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి పాఠశాల మ్యాగజైన్ ఉపయోగపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మంగళవారం రాజ్భవన్ పాఠశాల మ్యాగజైన్ ఆవిష్కరించి మాట్లాడారు. రొటీన్గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల గురించి చదవాలి, రాయాలి అని ఆమె విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే 100 మంది పిల్లలకు ట్యాబ్లు అందించామని, దాతలు ముందుకు వస్తే మరికొందరికి అందజేస్తామని గవర్నర్ పేర్కొన్నారు.