Telangana: ప్రమాదంలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు | Government Whip Adluri Laxman Kumar Injured In Road Accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. తెలంగాణ ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు

Feb 19 2024 6:36 AM | Updated on Feb 19 2024 8:50 AM

Government Whip Adluri Laxman Kumar Injured In Road Accident - Sakshi

సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో లక్ష్మణ్‌ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement