adluri laxman kumar
-
జగిత్యాల కాంగ్రెస్లో ట్విస్ట్.. మంత్రి అడ్లూరికి కొత్త టెన్షన్!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో జగిత్యాల జిల్లా రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లిపోయినప్పటికీ హస్తం పార్టీలో వర్గ విభేదాలు ఆగలేదు. మంత్రి అడ్లూరి వర్గం వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ వర్గం అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చక్రం తిప్పుతున్నట్టు మంత్రి అనుచరులు బహిరంగంగానే కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.వివరాల మేరకు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ మూడు పదవులనూ ఎమ్మెల్యే వర్గీయులకే అప్పగించడంతో మంత్రి అడ్లూరి వర్గం ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తూ అడ్లూరి వర్గం మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తే మీరేం చేస్తున్నారంటూ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ పదవుల మాటేంటని ప్రశ్నించినట్టు తెలిసింది.జీవన్ రెడ్డిని కాదని మంత్రితో ఉంటే ఎమ్మెల్యే అనుచరులు, మాజీ బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా మండిపడుతున్నారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన మంత్రి అడ్లూరి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని సీనియర్లతో చర్చించడానికి సిద్దమైనట్టు తెలిసింది. అయితే, పార్టీ అంతర్గత విభేదాలు బట్టబయలు కావడంతో మంత్రి అడ్లూరికి కొత్త తిప్పలు మొదలైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైచేయి సాధించినట్టు పలువురు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా సంజయ్ వర్గీయులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగిత్యాల బీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్, మైనార్టీశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మాజీ కౌన్సిలర్ జంబర్తి లక్ష్మికి అవకాశం కల్పించడంతో విభేదాలు బయటకు వచ్చాయి. -
సమానత్వ పథంలో తెలంగాణ
గన్¸ఫౌండ్రి (హైదరాబాద్): భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సమానత్వ పథంలో నడుస్తోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మహనీయుల జయంతి ఉత్సవాలను కేవలం స్మరణ కోసమే కాకుండా దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే సంకల్ప దినంగా మార్చాలని పేర్కొన్నారు. కాచిగూడ నింబోలి అడ్డాలో రూ.30 కోట్ల వ్యయంతో బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే లోయర్ ట్యాంక్బండ్ వద్ద రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దళిత విద్యార్థుల అభ్యున్నతికోసం ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మంత్రి ఫొటో ఎందుకు లేదు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ కాలం నుంచి నేటి వరకు దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తే ఆ ప్రకటనలలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. కోదాడ ప్రాంతంలో ఎస్సీ యువకుడు లాకప్ డెత్లో మరణిస్తే నేటి వరకు అక్కడి ఎస్ఐపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించాలని మంత్రిని కోరగా వచ్చేవారం కోదాడకు వెళ్తానని హామీ ఇచ్చారు. ప్రముఖుల నివాళి.. బషీర్బాగ్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఎంపీ మల్లు రవి, శాసన సభ్యులు సత్యనారాయణ, మందుల సామేల్, నాగరాజు, శాసనమండలి విప్ అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఓయూ ప్రొఫెసర్ కాసీం, దళిత జాతీయ నాయకుడు జేబీ రాజుతోపాటు వివిధ ఉద్యోగ, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సంరక్షణ మరిస్తే జీతంలో 15% కోత
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు సరికొత్తగా రూపొందించిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు–2026’ను ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత, గౌరవప్రద జీవనానికి వీలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. కాగా కుటుంబ వ్యవస్థలో తగ్గుతున్న బాధ్యతలను..ఇకపై తప్పనిసరిగా నెరవేర్చేలా చేసేందుకు ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. కేంద్రం 2007లో ఇలాంటి ఓ చట్టం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ..అంతకంటే కఠినమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. చట్టంలో ఏముంది..ఈ చట్టం కట్టుదిట్టంగా అమలయ్యేలా ప్రభుత్వం ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారితో పాటు జీతభత్యాలు పొందే ప్రతి ఒక్కరికీ (ప్రజాప్రతినిధులకు కూడా) వర్తిస్తుంది. అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే..పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణను బాధ్యతగా నిర్వహించకుంటే వారి వేతనంలో 15% లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం పిల్లలు పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు లేదా యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తుంది. నిరాదరణకు గురైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ లేదా కలెక్టర్ నియమించిన అధికారి ఇరువర్గాలను పిలిచి విచారణ జరుపుతారు. తర్వాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయిస్తూ ఆదేశాలిస్తారు. దరఖాస్తును అది అందిన 60 రోజుల్లోగా తప్పకుండా పరిష్కరించాలిఒకవేళ అధికారి ఆదేశాలపై దరఖాస్తు దారులు సంతృప్తి చెందకున్నా, గడువులోగా పరిష్కారం చేయకున్నా రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి ప్రధాన కమిషనర్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి నుంచి దరఖాస్తుదారుడు నేరుగా వయోవృద్ధుల కమిషన్లో అప్పీలు చేసుకున్న తర్వాత నెలరోజుల్లోగాతప్పకుండా పరిష్కరించాలి. -
నేను వెనక్కి తగ్గను జీవన్ రెడ్డితో కాంగ్రెస్ మంత్రుల చర్చలు విఫలం
-
హరీశ్రావు.. దమ్ముంటే చర్చకు రా..
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకొని, దాచుకొని ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ను ‘దండుపాళ్యం బ్యాచ్’అంటారా అని మాజీమంత్రి హరీశ్రావుపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ నిప్పులు చెరిగారు. మంత్రివర్గం, సీఎం రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మంత్రుల సముదాయంలో ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం, మందుల సామేల్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్యాదవ్లతో కలిసి మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడారు.మీ మామ, మీరు.. నీ బామ్మర్దులు దండుపాళ్యం ముఠా నాయకులని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచు కున్న మీరే ‘స్టువర్ట్పురం దొంగలకు మించిన బందిపోట్లు’అని ఘాటుగా విమర్శించారు. మీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నా, మీ ముగ్గురే నడిపించారని, అదే సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో దళితులు, బలహీనవర్గాలు ఉన్న కేబినెట్ను అవమానిస్తావా అని ప్రశ్నించారు. కేబినెట్పై మా ట్లాడిన హరీశ్రావును సిద్దిపేట దేవాలయంలో చర్చకు రావాలని సవాల్ విసిరితే రాకుండా తోక ముడిచారని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎవరినో పంపడం కాదు..నీకు దమ్మూ ధైర్యం ఉంటే చర్చకు నువ్వేరా.. ప్రజల ముందే చర్చిద్దామని సవాల్ విసిరారు. ⇒ బీఆర్ఎస్ దండుపాళ్యం బ్యాచ్కు నాయకుడు హరీశ్రావేనని మందుల సామేల్ అన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రతి పనిలో దోచుకున్నార న్నారు. నాగరాజు మాట్లాడుతూ మీరు చేసిన పనులకు లలిత్మోదీ, విజయ్ మాల్యలు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారన్నారు. వేముల వీరేశం మాట్లాడుతూ మంత్రి అడ్లూరి సవాల్ ను స్వీకరించకుండా హరీశ్రావు పారిపోయారని చెప్పారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లు మాట్లాడుతూ కేసీఆర్ అడ్రస్లేదని, వస్తారో లేదో కూడా తెలవదని ఎద్దేవా చేశారు. ఎంపీ అనిల్ మాట్లాడుతూ ప్రజలను మో సం చేస్తే సరైన తీర్పు ఇస్తారన్నారు. -
జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కొత్త డ్రామాలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. కాంగ్రెస్ మంత్రులు, మాజీ మంత్రి హరీష్ అనే విధంగా రాజకీయం నడుస్తోంది. తాజాగా హరీష్ వ్యాఖ్యలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కౌంటరిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఓట్ల కోసమ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోంది. బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గులాబీ నేతల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు లేదు. బీఆర్ఎస్ ఎన్నో హామీలను ఎగ్గొట్టింది. ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు.మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. హరీష్ రావు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల మంత్రులు ఉన్న కేబినెట్ను దండుపాళ్యం బ్యాచ్ అని హరీష్ రావు ఎలా అంటారు. రాష్ట్ర మంత్రి వర్గం దండుపాళ్యం బ్యాచ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టువర్ట్ పురం దొంగలా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న కేబినెట్పై చేసిన వ్యాఖ్యలకు గాను హరీష్ రావు తక్షణమే క్షమాపణలు చెప్పాలి.కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ కవిత చేసిన ఆరోపణలపై చర్చకు రమ్మంటే తొక ముడిచిన హరీష్ రావు.. ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను చర్చకు పంపుతానంటున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావడానికి మేము సిద్ధమేనన్నారు. కేసీఆర్ మీ అల్లుడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ కు తెలియకుండా హరీష్ రావు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారు. అందువల్లే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా హరీష్ రావుకు కేసీఆర్ వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్, చందర్ అరెస్ట్..
బీఆర్ఎస్ నేతలు అరెస్ట్..బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ అరెస్ట్మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చర్చకు రాచాలంటూ.. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలుబీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్కు పోలీసులకు మధ్య తోపులాటబీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలింపుతెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి హరీష్, కొప్పుల ఈశ్వర్ మధ్య రాజకీయ సవాళ్లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాలనపై చర్చకు సచివాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని మంత్రి కొప్పుల సవాల్ విసిరారు. దమ్ముంటే హరీష్ రావు చర్చకు రావాలి అంటూ మంత్రి అడ్లూరి ప్రతి సవాల్ విసిరారు. దీంతో, రాజకీయం ఆసక్తికరంగా మారింది.మంత్రి వర్సెస్ మాజీ మంత్రి..పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనతో చర్చకు రావాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కొప్పుల వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందిస్తూ..హరీష్ రావు గడ్డ మీదకి వెళ్ళి సవాల్ విసిరాను. దమ్ముంటే హరీష్ రావు చర్చకు రావాలి. నా మీద ఓడిన కొప్పుల ఈశ్వర్ రావడం ఏంటి?. హరీష్ మొహం చాటేసుకుని పోయారు. నేను నా ఇంట్లో రెడీగా ఉన్నాను. హరీష్, కేటీఆర్ వస్తే బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాను. కొప్పుల ఈశ్వర్, రసమయి వస్తే మా ప్రీతం వెళ్ళి సమాధానం చెప్తాడు. కేబినెట్ పర్సనల్ పంచాయితీలు జరగలేదు. హరీష్ రావు వచ్చి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ పాలన.. మా పాలనపై దమ్ముంటే చర్చకు రండి అని కామెంట్స్ చేశారు.హరీష్ రావు కౌంటర్.. మరోవైపు.. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ఆటోలో కోకాపేట్ నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు ప్రయాణించారు. అనంతరం, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు వెళ్లారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరితో చర్చకు మా నాయకుడు కొప్పుల ఈశ్వర్ వస్తారు. కొప్పుల ఈశ్వర్తో చర్చకు కాంగ్రెస్ నేతలు రెడీగా ఉండాలి. కేబినెట్లో మంత్రుల పంచాయితీలు జరిగాయని అన్ని మీడియాలో సైతం వచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపై ఒకరు దూషించుకున్నారన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవటానికే ఆటోలో ప్రయాణం చేశాను.రేవంత్ రెడ్డి పేరుకు ఉచిత బస్ అన్నారు. ఐదుసార్లు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నారు. రాహుల్ గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు. అశోక్ నగర్ వెళ్లి మెట్లపై కూర్చుని మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు. ఆటోలో వెళ్లి యూసుఫ్గూడలో ఆటో వాళ్లకి ఇచ్చిన హామీలను విస్మరించారు. రాష్ట్రంలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి. ఒక్కొక్క ఆటో కార్మికులకు 24 వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ ఉంది. రాహుల్ గాంధీ మళ్ళీ హైదరాబాద్కి రావా?. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్దే రాహుల్ గాంధీకి ఆటోలు అడ్డంగా పెట్టి కార్మికులు అడ్డుకుంటారు.రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. మంత్రులు వాటాలు పంచుకోవడానికి డబ్బులు ఉంటాయి.. కానీ, ఆటో కార్మికులకు ఇవ్వడానికి ఉండవా?. మూడువేల కోట్ల రూపాయల ఆదాయం మద్యంపై వచ్చింది. అవి ఆటో కార్మికులకు ఇవ్వండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆటో కార్మికులకు కాపాడుకుంటాం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించండి. లేని ఫ్యూచర్ సిటీకి 5000 కోట్లతో ఎందుకు రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వం వద్ద పైసలు లేక కాదు.. కమిషన్ వచ్చే వాటిపైన మాత్రమే దృష్టి పెడుతున్నారు. గద్దెనెక్కినంక గరీబోళ్ళని మర్చిపోయారు.. -
పార్టీలో నా స్థానం ఏంటి?.. మంత్రి ముందు జీవన్రెడ్డి ఆవేదన
సాక్షి, జగిత్యాల జిల్లా: తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారంటూ మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్రెడ్డి వాపోయారు. బీఆర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీపై జీవన్రెడ్డి అసంతృప్తి చేశారు. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమ స్థానమేంటని ప్రశ్నించారు.తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై చురకలు అంటించారు. మంత్రి శ్రీధర్బాబు, అడ్లూరి అడుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. -
‘ ఆ కార్యక్రమంలో నా గురించి మాట్లాడటం బాధాకరం’
ధర్మపురి(జగిత్యాల జిల్లా): నిజామాబాద్లో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి తన సహచర మంత్రి వివేక్ మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సాక్షి టీవీతో మాట్లాడారు అడ్లూరి. ‘లక్ష్మణ్ కుమార్ తండ్రి జయంతి కార్యక్రమాల్లో పేరు పెట్టకపోతే ప్రశ్నిస్తున్నాడు... ఇతర ఇన్విటేషన్స్ లో పేరు లేకపోతే ఎందుకు ప్రశ్నించడని వివేక్ మాట్లాడటం బాధాకరం. నేను ఆ విషయమే అసలెక్కడా మాట్లాడలేదు. వెంకటస్వామి జన్మదిన వేడుకలను నా ధర్మపురి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిపాకే నేను హైదరాబాద్ వెళ్లాను.నాకు ఆ అభిమానం ఉంది. నా మైనార్టీ శాఖ కార్యక్రమానికి వారే వచ్చి వస్తడా, రాడా వెళ్లిపొమ్మంటరా అంటూ మాట్లాడటం ఎంతవరకు సబబు..?, తోటి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను ఓ జంతువుతో పోలుస్తూ మాట్లాడితే కనీసం సహచర దళిత మంత్రిగా ఖండించకపోవడాన్నే నేను ప్రశ్నించా. తెల్లారే వ్యక్తిగతంగా ఫోన్ కాల్ అయినా చేస్తాడని భావించా. ఇవాళ మళ్లీ నిజామాబాద్కు వెళ్లి వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడటం ఇక వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నా. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాలి తప్ప ఈ విధంగా కామెంట్స్ చేయడం బాధాకరం. నేను కాంగ్రెస్ వ్యక్తిని, వ్యక్తిగత విభేదాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నా. కాంగ్రెస్లో పెద్దలు ఆశీస్సులతో ఇంత వరకూ వచ్చా’ అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. -
ఒక్కటైన పొన్నం.. అడ్లూరి!
-
ముగిసిన వివాదం.. అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో (Telangana Politics) ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య మాటల వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఐక్యంగా పోరాటం చేస్తాం, కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి లక్ష్మణ్ కుమార్కు క్షమాపణ చెప్పారు. లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను.. మంత్రి అడ్లూరి, పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడిలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు.సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. మేమంతా ఐక్యంగా భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం’ అని తెలిపారు. సమస్య ముగిసింది: అడ్లూరిమంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..‘అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని నేను కాదు. పొన్నం ప్రభాకర్ను గౌరవిస్తా.. కానీ, పొన్నం వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది అని చెప్పుకొచ్చారు. టీపీసీసీ కీలక వ్యాఖ్యలు.. అనంతరం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు. -
అడ్లూరినేం అనలేదు.. ఇది బీఆర్ఎస్ కుట్ర: పొన్నం
తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.అడ్లూరి వీడియోలో.. ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?.. .. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.పొన్నం పేరిట వైరల్ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది. ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బిగ్ ట్విస్ట్ -
కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. వివేక్, పొన్నంపై మంత్రి అడ్లూరి సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. సహచర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు చేశారు. తాను పక్కనే కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. పొన్నం తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొన్నం ఎపిసోడ్పై మంత్రి అడ్లూరి వీడియోను విడదల చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాజాగా మాట్లాడుతూ..‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి.నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కలుస్తాను. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. పొన్నం అంటుంటే సహచర మంత్రిగా ఉన్న వివేక్ కనీసం ఖండించలేదు. వివేక్ కొడుకును దగ్గరుండి ఎంపీగా గెలిపించాం కదా?. ఇది కూడా గుర్తులేదా?. కాకా వెంకటస్వామి నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. కానీ, వివేక్ది ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ లో మంత్రులు పెట్టిన ప్రెస్ మీట్ లో లేటుగా వచ్చినా అడ్లూరి లక్ష్మణ్ ను “దున్నపోతు” అంటున్నా పొన్నం అన్న మనకి టైం అంటే తెలుసు ఆ..దున్నపోతు గాడికి టైం గురించి ఎం తెలుసు... pic.twitter.com/g0F8wq38vL— Arshad (@Iamarshad46) October 5, 2025Video Credit: Arshadటీపీసీసీ చీఫ్ ఫోన్.. మరోవైపు.. కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టి సారించారు. విషయం తీవ్రతరం కాకుండా రంగంలోకి దిగి.. తాజాగా మంత్రులు పొన్నం, అడ్లూరికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. ఇద్దరు నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మంత్రి పొన్నం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదంటూ శ్రీధర్ బాబు సూచించారు. ఇక, తన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. తన వక్రీకరించారని తెలిపారు. అడ్లూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. -
Land Cruiser: రూ.3కోట్ల కారు.. ఊడిపోయిన టైరు
కోరుట్ల: ఆ కారు ఖరీదు ఇంచుమించు రూ.3 కోట్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పేరున్న కారు. ఏదైనా ప్రమాదం జరిగి.. కారు పల్టీలు కొట్టినా పది ఏయిర్ బ్యాగులు తెరుచుకుని భద్రత విషయంలో ఏ మాత్రం బెదిరిపోవాసిన అవసరం లేదన్న ప్రచారం ఉంది. దీనికితోడు బులెట్ ప్రూఫ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఖరీదైన కారు టైరు చిన్నపాటి ప్రమాదంలో ఎలా ఊడిపోయిందని స్థానికంగా చర్చ నడుస్తోంది. కారులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. అదే సమయంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కారు భద్రతపై మాత్రం లెక్కలేని సందేహాలు వస్తున్నాయి.అసలేం జరిగింది..?శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మంత్రి అడ్లూరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కోరుట్ల వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో మెట్పల్లి నుంచి తిరిగి ధర్మపురి వెళ్లేందుకు తన కారులో బయలుదేరారు. 15 నిమిషాల్లో కారు మెట్పల్లిదాటి మారుతీనగర్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో దెబ్బతిన్న ఓ కారును కోరుట్లలోని మెకానిక్ షెడ్ నుంచి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి తీసుకువెళ్తున్న టోచన్ వాహనం ఎదురుగా వచ్చింది. రెండు వాహనాలు ఎదురెదురుగా చిన్నగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అకస్మాత్తుగా మంత్రి కారు టైర్ ఊడిపోయింది. కారు టైర్ ఊడిపోవడం మినహా మంత్రి కారుకు ఎక్కడా ఎలాంటి గీత పడకపోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో మంత్రి అడ్లూరి క్షేమంగా బయటపడగా.. టోచన్ వాహనంతో కారును తెస్తున్న వారిలో ఇమ్రాన్ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే మెట్పల్లి పోలీసులు వచ్చి రెండు వాహనాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు. భద్రత సంగతి దేవుడెరుగు..మంత్రి కారులో ఉన్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఏ పరికరంలోనైనా విడిభాగాలను బిగించే చిన్న చిన్న నట్లు, స్క్రూలు, ఇతరత్రా పరికరాల్లో కొంచెం తేడా వచ్చినా.. లూజు అయినట్లు ఉన్నా ప్రమాద సూచికలు ఇస్తుందని సమాచారం. శనివారం రాత్రి జరిగిన చిన్నపాటి ప్రమాదానికే ఫోర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉన్న మంత్రి కారు టైరు ఎలా ఊడిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కారు టైర్ ముందుగానే కాస్త లూజ్ అయి ఉంటే దానికి సంబంధించిన ప్రమాద సూచికలు ఎందుకు రాలేదన్న సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ప్రమాద సంకేతాలు వచ్చినా డ్రైవర్ సరిగా దృష్టి పెట్టలేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తుగా ప్రమాదాన్ని నివారించే టెక్నాలజీ వ్యవస్థ సైతం ఈ కారులో ఉంది. అంతే కాకుండా ఈ వాహనం భద్రతా రేటింగ్ 5 స్టార్ కావడం గమనార్హం.అవే కార్లు...గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రుల కోసం ఇదే రకం 22 కార్లను కొనుగోలు చేసిన విషయం తెలి సిందే. కొత్త ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా లో టు ఉన్నా ఇంత లగ్జరీ కార్లు ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అవే కార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు కేటాయిస్తున్నారు. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు కేటా యించిన కారు కూడా అదే కావడం గమనార్హం. -
ముగ్గురికే పట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్టుగానే ఈ దఫాలో ఈ ముగ్గురికే మంత్రులుగా అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 నిమిషాలకు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం తొలుత వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, అనంతరం వాకిటి శ్రీహరిల చేత గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగానే వివేక్ ఇంగ్లిష్లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ముగ్గురిని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలు పూలబొకేలు ఇచ్చి అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మరోమారు జాతీయగీతాలాపనతో 12:22 నిమిషాలకు ప్రమాణ కార్యక్రమం ముగిసింది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ జి ప్రసాద్కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలు, కేబినెట్ మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. రాజ్భవన్లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్తో మంత్రులుగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో సీఎం రేవంత్ మరో మూడు బెర్తులు ఖాళీగానే... కొత్తగా ముగ్గురు ప్రమాణం చేయడంతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, మరో 11 మంది కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడు మరో ముగ్గురు కొత్తగా మంత్రులు కాగా, ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉండిపోయాయి. ఈ మూడు బెర్తులను కూడా వీలున్నంత త్వరలోనే భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెండో దఫా కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సరిగ్గా సంవత్సరం ఏడు నెలల తర్వాత విస్తరణకు ముహూర్తం కుదిరింది. 2023, డిసెంబర్ 7న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, మళ్లీ 2025, జూన్ 8న తొలిదఫా విస్తరణ జరిగింది. అదిగో.. ఇదిగో అంటూ పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ముగ్గురిని కేబినెట్లో తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. -
మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్ అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పీఎస్కు తరలించారు. పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. -
కారు బోల్తా..కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాయాలు
-
Telangana: ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కు గాయాలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ కుమార్తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.


