
ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో రప్పా రప్పా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటీవల మృతి చెందిన మాజీ వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్.. ఖమ్మం వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ కేటీఆర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ఒకటి వెలిసింది.
2028లో రప్పా రప్పా అంటూ ఉన్న ఓ ఫ్లెక్సీ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ‘ 3.o లోడింగ్. 2028లో రప్పా రప్పా. కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తాం ’ అని ఫ్లెక్సీలో ముద్రించి ఉంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.