నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. పోటెత్తిన జనం | Fish Prasadam Distribution At Nampally Exhibition Ground | Sakshi
Sakshi News home page

నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. పోటెత్తిన జనం

Jun 8 2025 11:30 AM | Updated on Jun 8 2025 11:40 AM

Fish Prasadam Distribution At Nampally Exhibition Ground

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. మంత్రి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. చేప ప్రసాదం పంపిణీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 42 క్యూ లైన్ కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.

అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రత మానిటరింగ్ ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ మానిటర్ చేస్తున్నారు. 1000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తన శ్రీమతి కుటుంబం ఢిల్లీ నుండి వచ్చి ఆ కాలంలోనే చేప మందు తీసుకున్నారని.. ఇది బ్రహ్మాండమైన  ఔషధం అని కితాబు నిచ్చారు నేచురల్ ఔషాధాలతో కూడిన మందు అని.. ఈ ప్రసాదాన్ని ప్రోత్సహించాలన్నారు. దాదాపు 170 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఈ మందు అందిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement