అప్పుల బాధ తాళలేక.. 

Farmer Commits Suicide Drinking Insecticide Due To Debt In Kamareddy District - Sakshi

ధాన్యం కుప్ప వద్దే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య 

బాన్సువాడ రూరల్‌: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసు కున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం డలం హన్మాజీపేట్‌ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సింగం శంకర్‌ (52) ఇటీవలే వరి పంట కోసి తన పొలం పక్కనే ఆరబె ట్టాడు.

ఆదివారం రాత్రి ధాన్యం కాపలా కో సం ఇంటి నుంచి వెళ్లిన అతడు.. సోమవారం తెల్లవారు జామున పురుగు ల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం కుప్పపై విగతజీవిగా పడిఉన్న శంకర్‌ను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంటలు పండక నష్టాలు వచ్చి అప్పులు పెరిగి పోయాయని మృతుడి భార్య లక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top