హైదరాబాద్: తనను గదిలో బంధించి కొట్టి బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ బిల్డర్ఇచ్చిన పిర్యాదుమేరకు చిన్నబోయిన శంకర్ అలియాస్ అంబర్పేట శంకర్ను బుధవారం బంజారాహిల్స్ పోలీసులు విచారించి నోటీసులు జారీ చేశారు. అంబర్పేట శంకర్తో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాకర్ల సాంబశివరావు, రవి, సుధాకర్, వినోద్, రాజా రమేష్ మదన్ సతీష్ లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
విచారణకు హాజరైన అంబర్పేట శంకర్ను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. ఆ రోజు ఏం జరిగిందన్న విషయాలపై ఆరా తీశారు. కమాలాపురి కాలనీలో కార్యాలయం ఎందుకు పెట్టారు..దాని వెనుకగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాజులరామారం ప్రాగా టూల్స్ కాలనీకి చెందిన ఆంజనేయులు అనే బిల్డర్ తనకు రావాల్సిన ప్లాట్లను తెలియకుండా అమ్మేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అంబర్పేట శంకర్తో పాటు మిగతా ఆరుగురుపై బెదిరింపుల కేసు నమోదు చేశారు.


