కేసీఆర్‌ను కలిసిన రైతు ఉద్యమకారుడు రాకేష్‌ టికాయత్‌ | Farmer Activist Rakesh Tikait Meets Telangana CM KCR In Delhi | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన రైతు ఉద్యమకారుడు రాకేష్‌ టికాయత్‌

Mar 3 2022 6:38 PM | Updated on Mar 3 2022 6:48 PM

Farmer Activist Rakesh Tikait Meets Telangana CM KCR In Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేసీఆర్‌ను రైతు ఉద్యమకారుడు రాకేష్‌ టికాయత్‌ గురువారం కలిశారు. మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. భేటీ అనంతరం రాకేష్‌ టికాయత్‌ మీడియాతో మాట్లాడుతూ, రైతు సమస్యలపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కిసాన్‌ ఎజెండా రూపొందించాల్సి ఉందని టికాయత్‌ పేర్కొన్నారు.

చదవండి: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి రియాక్షన్‌

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న  రైతు బంధు పథకం చాలా బాగుంది. జాతీయ స్థాయిలో ఈ రైతు పథకాలు అమలు చేయాలి. రాజకీయ అంశాలు సమావేశంలో మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో రాజకీయ మార్పు ఇప్పుడు ఏమి చెప్పలేనని రాకేష్‌ టికాయత్‌ అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement