హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం | DRI Officers Arrested Drug Mafia in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌.. ముఠా అరెస్ట్‌

Aug 17 2020 8:09 PM | Updated on Aug 17 2020 8:34 PM

DRI Officers Arrested Drug Mafia in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 250 కిలోల మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందు ఏపీడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్‌లను డీఆర్‌ఐ( డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటిలిజెన్స్‌) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ ఏక కాలంలో ముంబై, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఆర్‌ఐ అధికారులు కార్గో బస్సుని వెంటాడి పట్టుకున్నారు.

హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో రూ. 100 కోట్ల విలువైన మత్తు మందును తయారు చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ మత్తుమందును సరఫరా చేసేందుకు ఈ డ్రగ్‌ మాఫియా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో అరెస్ట్ అయిన ఒక డ్రగ్ డీలర్‌ను అధికారులు తిరిగి పట్టుకున్నారు. 28 కోట్ల రూపాయల విలువైన 142 కిలోల మెఫిడ్రిన్‌ను, 50 కోట్ల విలువైన రా మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.‌45 లక్షల నగదును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (వరదలపై అధికారులను అప్రమత్తం చేసిన హరీశ్ రావు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement