సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో పంటలు కొనే నాథుడే లేడని.. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన దాఖలా లేదన్నారు.


