
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, శ్రీశైలం దర్శనం కోసం వెళ్లి అనంతరం తిరిగి వస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.