11 రోజులుగా విద్యార్థి అదృశ్యం.. పోలీసులు విచారణలో | BTech student missing in Jagtial | Sakshi
Sakshi News home page

11 రోజులుగా విద్యార్థి అదృశ్యం.. పోలీసులు విచారణలో

Jun 7 2026 12:26 PM | Updated on Jun 7 2026 1:30 PM

BTech student missing in Jagtial

సాక్షి, హైదరాబాద్: జగిత్యాలకు చెందిన రాహుల్ అనే బీటెక్‌ విద్యార్థి కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. రాహుల్ చదువుతున్న కాలేజీలో ఎంక్వైరీ చేశారు.  సదరు అబ్బాయికి ఒక అమ్మాయితో గొడవ జరిగినట్లు సమాచారం. కాగా ఆయన చివరిసారిగా కాచిగూడలోని రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలు స్టేషన్ సీసీటీవీ చిత్రాలలో నమోదయ్యాయి.

కాగా ప్రస్తుతం సదరు విద్యార్థి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న రాహుల్ సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హస్టల్‌లో నివాసం ఉంటున్నాడు.  మే 27నుంచి విద్యార్థి కనిపించడం లేదు. విద్యార్థి మిస్సింగ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement