నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు | BRS MLAs for Moosi visit: Telangana Bhavan | Sakshi
Sakshi News home page

నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

Sep 29 2024 6:20 AM | Updated on Sep 29 2024 6:20 AM

BRS MLAs for Moosi visit: Telangana Bhavan

బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల్లో భరోసా నింపడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు. 

మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హైదర్‌షాకోట్‌తో పాటు సమీప కాలనీల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంది. మూసీ పరీవాహక కాలనీల్లో అధికారుల సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు పారీ్టపరంగా భరోసా ఇస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement