సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత పిటిషన్ నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు వినాలని కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీకి దిగడంతో దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.


