సీఎం ప్రజావాణిలో దరఖాస్తుదారుల తాకిడి | 136 applications received at Praja Vani program in Hyderabad | Sakshi
Sakshi News home page

సీఎం ప్రజావాణిలో దరఖాస్తుదారుల తాకిడి

Sep 18 2026 8:21 PM | Updated on Sep 18 2026 8:49 PM

136 applications received at Praja Vani program in Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన 256వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 11 గ్రూపులు, 575 మంది ద్వారా 136 దరఖాస్తులు అందాయి.

రెవెన్యూ శాఖకు 33, బీసీ సంక్షేమ శాఖకు 27, హోం శాఖకు 15, ఇతర శాఖలకు 61 దరఖాస్తులు  అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి ఓపికగా దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్‌మెంట్‌  చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా మలి దశ ఉద్యమకారులకు తగిన గుర్తింపును ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించి, ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ పలువురు అర్జీలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement