నేటి నుంచి ఆర్ట్‌–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌.. | Art Photography Exhibition At The State Art Gallery Madapur, Hyderabad | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆర్ట్‌–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌..

Jun 28 2024 12:38 PM | Updated on Jun 28 2024 12:38 PM

Art Photography Exhibition At The State Art Gallery Madapur, Hyderabad

గచ్చిబౌలి: మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో మూడు రోజులపాటు ఆర్ట్‌–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు రూపొందించిన ఫొటోలను ప్రదర్శిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఆదివారం వరకూ ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తారు.

ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్, కార్యదర్శి శృతిఓజా, సాంస్కృతిక, భాషాశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఇంటరీ్మడియట్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్, ఆర్‌జేడీ బి జయప్రదబాయి, ఎస్‌ఐవీఈ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆర్‌ జ్యోష్ణారాణి పాల్గొంటారు.  10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement