ఎమ్మెల్యేల కేసు: హైకోర్టులో హీటెక్కిన వాదనలు.. ఎవరిది పైచేయి?

Arguments In High Court MLAs Poaching Case To Hand Over To CBI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. నిందితుల తరపు న్యాయవాది రేపు మరోసారి వాదనలు వినిపించనున్నారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే, సిట్‌ కాకుండా ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టులో సిట్‌ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా.. బీజేపీ తరఫున మహేష్‌ జఠ్మలాని, సిట్‌ తరఫున దుశాంత్‌ దవే వాదనలు వినిపించారు. 

వాదనల సందర్భంగా.. 
బీజేపీ జఠ్మలాని..
- సిట్‌పై నమ్మకంలేదు.. సీబీఐ విచారణకు ఆదేశించాలి. 
- రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కేసులు పెట్టారు.
-  కేసుతో సంబంధంలేని వారిని ఎఫ్‌ఐఆర్‌లో​ చేర్చారు అని అన్నారు. 

సిట్‌ దుశాంత్‌ దవే..
- డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా సీబీఐతో విచారణ జరిపించాలనడం సరికాదు. 
- ముగ్గురు నిందితులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్‌ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట​్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top