
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్ 12) సోమవారం నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దీంతో, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
అయితే, తాజాగా సోషల్ మీడియాలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు!