breaking news
June 12
-
TS: స్కూల్స్కు సెలవులు పొడిగింపు.. విద్యాశాఖ క్లారిటీ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్ 12) సోమవారం నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దీంతో, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు! -
జూన్ 12న కర్ణాటక బంద్
బెంగళూరు: ప్రభుత్వ కర్మాగారాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రైతుల రుణాల మాఫీ తదితర ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూన్ 12న కర్ణాటక బంద్కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం కన్నడ సంఘాల సమాఖ్య నాయకులు వాటాళ్ నాగరాజ్, సా.రా.గోవింద్, కేఆర్.కుమార్, గిరీశ్గౌడ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి రుణ మాఫీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కర్మాగారాలను ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కర్మాగారాలను మూత వేయటం ద్వారా ప్రైవేట్ వారికి ఆస్తులు విక్రయించే కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. అలాగే మేకదాటు ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని మైసూరు బ్యాంకు సర్కిల్ నుంచి రామనగర జిల్లా మేకదాటు వరకు ర్యాలీని చేపట్టనున్నట్లు చెప్పారు. కాసరగోడులో కన్నడ నేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా జూన్ 8న సరిహద్దు ప్రాంతంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ అన్ని డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ జూన్ 12న కర్ణాటక బంద్ను చేపడుతున్నామని తెలిపారు.