ఆస్తి కాజేశారని నటి గౌతమి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కాజేశారని నటి గౌతమి ఫిర్యాదు

Sep 14 2023 7:08 AM | Updated on Sep 14 2023 7:33 AM

- - Sakshi

తన ఆస్తిని కాజేశారని నటి గౌతమి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 29వ తేదీ మరిన్ని వివరాలను అందించడానికి తిరువణ్ణామలై ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమచారం. గౌతమి 2004లో క్యాన్సర్‌ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఆస్తులకు పవర్‌ ఏజెంట్‌గా అళగప్పన్‌ అనే రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌ను నియమించుకున్నారు. కాగా అళగప్పన్‌ ఆయన కుటుంబ సభ్యులు శ్రీపెరంబత్తూర్‌లోని గౌతమికి చెందిన రూ.25 కోట్ల ఆస్తులను పోర్జరీ పత్రాలతో ఆక్రమించినట్లుగా సోమవారం చైన్నె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు.

తిరువణ్ణామలైలో 2019లో రూ.48 లక్షలతో 4 ఎకరాల భూమిని కోనుగోలు చేశానని.. ఇప్పుడు కోట్ల విలువ చేస్తుందని.. ఆ భూమిని అళగప్పన్‌, అతని భార్య నాచ్చాన్‌ కాజేశారని తన న్యాయవాది ద్వారా తిరువణ్ణామలై జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అళగప్పన్‌, అతని భార్యను స్టేషన్‌కు పలిపించారు. డీఎస్పీ అన్నాదురై, ఇన్‌స్పెక్టర్‌ కవిత విచారించారు. కాగా ఈ కేసులో మరిన్ని ఆధారాలను సమర్చించడానికి నటి గౌతమి ఈ నెల 29వ తేదీ తిరువణ్ణామలై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement