ఐటమ్‌ సాంగ్స్‌ కోసం భారీ పారితోషికం తీసుకొన్న సాయేషా ఆర్య! | - | Sakshi
Sakshi News home page

ఐటమ్‌ సాంగ్స్‌ కోసం భారీ పారితోషికం తీసుకొన్న సాయేషా ఆర్య!

Mar 30 2023 7:24 AM | Updated on Mar 30 2023 7:23 AM

- - Sakshi

 సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఐటమ్‌ సాంగ్స్‌ చిత్రాలకు క్రేజ్‌ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల పుష్ప చిత్రంలో ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ పాట ఎంతో హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ పాటలో నటించేందుకు నటి సమంత భారీ పారితోషికం పుచ్చుకుందన్న ప్రచారం జరిగింది. అలాంటి ఐటమ్‌ సాంగ్స్‌లో నటించే స్టార్‌ హీరోయిన్లకు అంత డిమాండ్‌ ఉంటుంది మరి. తాజాగా నటి సాయేషా ఆర్య కూడా ఐటెమ్‌ సాంగ్‌కు భారీ పారితోషికం అందుకున్నట్లు తెలిసింది.

ఈ బాలీవుడ్‌ బ్యూటీ నటుడు ఆర్యన్‌ను పెళ్లి చేసుకున్న తరువాత కోలీవుడ్‌కు దూరమయ్యారు. తమిళంలో ఈమె నటించిన చివరి చిత్రం కాప్పాన్‌. కాగా తాజాగా పత్తుతల చిత్రంలో ఓ ఐటమ్‌ సాంగ్‌లో మెరవనున్నారు. నటుడు శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. గౌతమ్‌ కార్తీక్‌, నటి ప్రియా భవానీ శంకర్‌ తదితరులు ప్రధాన పాత్రలు ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు తెరపైకి రానుంది. ఇందులో ఐటమ్‌ సాంగ్‌లో నటించడానికి నటి సాయేషా ఆర్య రూ.40 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement