వైభవంగా నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నిత్యకల్యాణం

Aug 20 2025 6:03 AM | Updated on Aug 20 2025 6:03 AM

వైభవంగా నిత్యకల్యాణం

వైభవంగా నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని మంగళవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై స్వామిఅమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement