
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్కు 6,191 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి 5,060 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 141 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 642.50 అడుగుల(3.84 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది.